స‌మ‌ర‌ శంఖారావం పూరించిన జ‌గ‌న్


ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.ఈ నేప‌ధ్యంలో ఫిబ్రవరి 4వతేదీ నుంచి వైసీపీ నేత‌లు బూత్ లెవల్ సమావేశాలు నిర్వహించాల‌ని డిసైడ్ అయ్యారు. క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ బూత్ లెవల్ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 4వ తేదిన సమర శంఖారావం పేరుతో చిత్తూరు జిల్లా నుండి ఈ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు.
  దీంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ ప్రణాళికలను సిద్దం చేశారు. ఈ తరుణంలోనే రాయలసీమ జిల్లాల్లో ముందుగా సమర శంఖారావం పేరిట జిల్లాల పర్యటనలు చేయనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ పార్టీకి చెందిన బూత్ లెవల్ కార్యకర్తలతో జగన్ భేటీ కానున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన కడప, ఫిబ్రవరి 6వ తేదీన అనంతపురం జిల్లాలకు చెందిన నేతలతో జగన్ సమావేశం కానున్నారు.  


Comments